హైదరాబాద్:రానున్న ఉప ఎన్నికలు తెలంగాణ ఉద్యమానికి పరీక్షా సమయంగా తెరాస సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ అభివర్ణించారు. తెరాస గెలిస్తే సరి.. లేకపోతే తెలంగాణ అంధకారమేనని తెలంగాణ ప్రాంత ప్రజలు గుర్తించాలని హితవు పలికారు.ఆ పరిస్థితి రాకూడదనుకొంటే వచ్చే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, తెదేపాలను చిత్తుగా ఓడించి తెలంగాణను సాధించుకోవాలని పిలుపునిచ్చారు.
సోమవారం తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 'వైఎస్ పాలనలో తెలంగాణ' అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో జయశంకర్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణకు వైఎస్ పెద్ద అవరోధంగా పేర్కొన్నారు. ఇంత కాలం తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ అధిష్ఠానానికి వదిలేశామని వైఎస్ చెప్పారు. ఇప్పుడేమో మాటమార్చి అభివృద్ధి మంత్రాన్ని ముందుకు తీసుకువచ్చి.. తెలంగాణవాదం కనుమరుగైందని పేర్కొనడంలో పరమార్ధమేమిటి అని ప్రశ్నించారు.
పదవులు లేని నాయకులే తెలంగాణ వాదనను ముందుకు తెస్తున్నారని సీఎం వ్యాఖ్యానించడం తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షపై బురద చల్లడమేనన్నారు.తెలంగాణ ఉద్యమం పదవుల కోసం కాదు. ప్రజల ఆత్మ గౌరవం, స్వయంపాలన, వనరుల వినియోగంపై హక్కుల సాధన కోసం చేస్తున్న పోరాటమిదిగా పేర్కొన్నారు. కాంగ్రెస్ చరిత్రంతా మోసాలమయమేనని ఆరోపించారు. 1956 నుంచీ తెలంగాణను కాంగ్రెస్ వంఛిస్తోందని విమర్శించారు.
Sunday, May 11, 2008
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment